ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పీజేఆర్ ఫ్లైఓవర్ ను శనివారం(జూన్ 28) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే…. హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.