ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు- గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష, సబితా ఇంద్రారెడ్డికి ఊరట-obulapuram mining case cbi court verdict 4 convicted sabitha indra reddy clean sheet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు- గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష, సబితా ఇంద్రారెడ్డికి ఊరట

ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు- గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష, సబితా ఇంద్రారెడ్డికి ఊరట

ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. గాలి జనార్థన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు, గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి,ఓఎంసీ కంపెనీని కోర్టు దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించించింది.

ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులు జైలు జీవితం గడిపారు. 2022లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు.

సబితా ఇంద్రారెడ్డికి ఊరట

ఓబుళాపురం మైనింగ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏ 1 నుంచి ఏ 7 వరకు సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ8 కృపనందం, ఏ 9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది.

15 ఏళ్ల సుదీర్ఘ విచారణ

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం అక్రమ మైనింగ్ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను దోషులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసింది.

గాలి జనార్థన్ రెడ్డికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష

గాలి జనార్దన్‌ రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఐదుగిరికి శిక్షలు ఖరారు

అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి రూ.వేల కోట్లు అక్రమార్జన సంపాదించారని గాలి జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు రాగా, సీబీఐ కేసు నమోదు చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టిన సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది.

అంతిమంగా అక్రమ మైనింగ్ నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 మెఫజ్‌ అలీఖాన్‌లను దోషులుగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఏ8 విశ్రాంత ఐఏఎస్‌ కృపానందం, ఏ9 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులగా గుర్తించింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం