ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి,ఓఎంసీ కంపెనీని కోర్టు దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించించింది.
ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులు జైలు జీవితం గడిపారు. 2022లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు.
ఓబుళాపురం మైనింగ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏ 1 నుంచి ఏ 7 వరకు సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ8 కృపనందం, ఏ 9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం అక్రమ మైనింగ్ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్గా ఉన్న వీడీ రాజగోపాల్ను దోషులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసింది.
గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్కు పాల్పడి రూ.వేల కోట్లు అక్రమార్జన సంపాదించారని గాలి జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు రాగా, సీబీఐ కేసు నమోదు చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టిన సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేసింది.
అంతిమంగా అక్రమ మైనింగ్ నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 మెఫజ్ అలీఖాన్లను దోషులుగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఏ8 విశ్రాంత ఐఏఎస్ కృపానందం, ఏ9 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులగా గుర్తించింది.
సంబంధిత కథనం