జేఈఈ మెయిన్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ, ఓపెన్ కేటగిరీలలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్-narayana educational institutes creates history in jee main results ranks first in all india in open categories ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జేఈఈ మెయిన్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ, ఓపెన్ కేటగిరీలలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

జేఈఈ మెయిన్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ, ఓపెన్ కేటగిరీలలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలలో మరోసారి నారాయణ సత్తాచాటిందని నారాయణ విద్యాసంస్థలు పేర్కొన్నారు. నారాయణ విద్యార్థులు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 9 ర్యాంకులు సాధించారని తెలిపారు.

జేఈఈ మెయిన్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారాయణ, ఓపెన్ కేటగిరీలలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

జేఈఈ-మెయిన్ 2025 ఫలితాలలో టాప్ ర్యాంకులతో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తాచాటారని ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 9 ర్యాంకులు 2 అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డా.పి. సింధూర నారాయణ, పి. శరణినారాయణ, రమా నారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో బణి బ్రత మాజీ (H.No : 250310746461) 1వ ర్యాంకు, టి. శివెన్ వికాస్ (H.No : 250310391420 N-Prep) 9వ ర్యాంకు, సౌరవ్ (H.No : 250310254844) 12వ ర్యాంకు, ఆర్చిస్మాన్ నంది (H.No : 250310013515 N-Prep) 13వ ర్యాంకు, సన్నధ్య షరాఫ్ (H.No : 250310296087) 19వ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ (H.No : 250310009213) 20వ ర్యాంకు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 1, 9, 12, 13, 19, 20లతో పాటు వందలోపు 25 ర్యాంకులు, 1000 లోపు 165 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని కొనసాగించినట్లు తెలిపారు. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 2 తో పాటు 10 లోపు 13 మంది విద్యార్థులకు ర్యాంకులు, 100 లోపు 94 ర్యాంకులు, 1000 లోపు 750 ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమా నారాయణ మాట్లాడుతూ... గత 6 సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరీలో 3 సార్లు (2020, 2021, 2025) ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించటం నారాయణ కమిట్మెంట్ కు ఈ రికార్డులే నిదర్శనమన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 24 మంది ఉండగా, వారిలో 8 మంది (33%) నారాయణ విద్యార్థులు కావటం గమనించ దగ్గ విషయం అన్నారు.

జేఈఈ మెయిన్ లో నారాయణ విజయదుందుభి

నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డా॥ పి. సింధూర నారాయణ మాట్లాడుతూ... జేఈఈ మెయిన్ కలలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరని, పోటీరారని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 14.75 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన పరీక్ష రాయగా, వీరిలో సామాజిక వర్గాల వారీగా, రిజర్వేషన్లకు అనుగుణంగా కేవలం 2.50 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత కల్పిస్తారని తెలిపారు. ఈ పరీక్షా ఫలితాలలో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు. నారాయణ అందించే శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లు, పటిష్ట ప్రణాళిక, స్టడీమెటీరియల్, నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షల వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో నారాయణ విద్యార్థులే టాపర్స్ నిలవటం నారాయణ ఘనతకు నిదర్శనంగా నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఓపెన్ కేటగిరీలో 1000 లోపు ర్యాంకుల్లో 165 కిపైగా ఉంటారని, అంటే దాదాపు 16% నారాయణ విద్యార్థులే కైవసం చేసుకోవటం గమనార్హమన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం