Actor Raghubabu: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడు మృతి-nalgonda brs leader killed in road accident of car hit by actor raghu babu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Actor Raghubabu: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడు మృతి

Actor Raghubabu: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడు మృతి

Sarath chandra.B HT Telugu

Actor Raghubabu: సినీ నటుడు రఘుబాబు నడుపుతున్న కారు ఢీకొనడంతో నల్గొండలో BRS నాయకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.

ప్రమాద సమయంలో కారు నడుపుతున్న రఘుబాబు

Actor Raghubabu: సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని BRS బీఆర్‌ఎస్‌ మండల స్థాయి నాయకుడు మృతి చెందాడు. Narkatpally నార్కట్‌పల్లి-అద్దంకి Addanki రహదారిపై జరిగిన ప్రమాదంలో నల్గొండ nalgonda జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి చెందారు.

నల్గొండ టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీలో నివసించే బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి Sandineni Janardhan Rao సందినేని జనార్దన్‌రావుకు సమీపంలోని లెప్రసీ కాలనీ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం ఉంది. పొలం వద్దకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు.

పానగల్‌ బైపాస్‌ మీదుగా వెళుతూ వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రాంతంలో రోడ్డుపై యూటర్న్‌ తీసుకుంటుండగా హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళుతున్న రఘుబాబు కారు ఢీకొట్టింది. ఆ సమయంలో కారును నటుడు స్వయంగా నడుపుతున్నారు. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో డివైడర్‌పై పడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

యూటర్న్‌ వద్ద మలుపు తీసుకునేందుకు వేగంగా రావడంతో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారును అదుపు చేయలేకపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డివైడర్ ప్రాంతంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు సడన్‌గా రావడంతోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.

కారు డీకొట్టడంతో జనార్దన్‌రావు డివైడర్‌ మీద ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన తల, ఛాతి భాగంలో బలమైన గాయాలయ్యాయి. జనార్థనరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

బీఆర్‌ఎస్‌ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్‌ రావు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అద్దంకి బైపాస్‌ రోడ్డులో వెంచర్‌ ఏర్పాటు చేసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం బైక్‌పై వెంచర్‌కు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.

నల్లగొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు బిఎండబ్ల్యూ కారు, జనార్థన్‌ నడుపుతున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనలో జనార్దన్‌ గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడి.. పక్కన ఉన్న డివైడర్‌పై పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.

రఘుబాబు వెనుకే మరో కారులో వచ్చిన ఆయన కుమారుడు ప్రమాదస్థలి వద్ద ఆగారు. జనార్దన్‌ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత కథనం