Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో విషాదం, బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి కూతురు మృతి-nagar kurnool mother daughter drowned in pond dead ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో విషాదం, బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి కూతురు మృతి

Nagar Kurnool : నాగర్ కర్నూల్ లో విషాదం, బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లి కూతురు మృతి

HT Telugu Desk HT Telugu

Nagar Kurnool : బట్టలు ఉతకడానికి వెళ్లిన తల్లీకూతరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ నాగానుల్ చోటుచేసుకుంది.

నాగర్ కర్నూల్ లో తల్లి, కూతురు మృతి

Nagar Kurnool : బట్టలు ఉతకడానికి అని వెళ్లి ప్రమాదవశాత్తు తల్లి కూతుర్లు చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగానుల్ గ్రామంలో జరిగింది. పోలీస్ తెలిపిన వివరాలు ప్రకారం నాగానుల్ గ్రామానికి చెందిన సరమ్మ ( 60 ),కూతురు సైదమ్మ (38) తో కలిసి గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారు.

కూతురిని కాపాడబోయి తల్లి

బట్టలు ఉతికే బండపై నాచు గుర్తించక కూతురు సైదమ్మ కాలు మోపడంతో చెరువులో పడిపోయింది. అది గమనించిన తల్లి కూతురిని కాపాడదామని వెళ్లి తాను చెరువులో మునిగిపోయింది. దీంతో తల్లి కూతుర్లు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. అటుగా వెళ్తోన్న కొందరు వారి మృతి దేహాలను గమనించి ఆదివారం ఉదయం వెలికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైదమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

నగరంలో ఒకే రోజు ముగ్గురి అదృశ్యం

అనుమానస్పద స్థితిలో ఓ యువకుడి అదృశ్యమైన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంకటగిరికి చెందిన రాజేష్ (22) స్థానికంగా మేస్త్రి పని చేస్తూ ఉంటాడు. వారం రోజుల క్రితం రాజేష్ తన ఇంటి నుంచి బైక్ తీసుకొని వెళ్లాడు. అప్పటి నుంచి రాజేష్ కనిపించడం లేదు. కాగా రాజేష్ సోదరుడు విజయ్ కుమార్ కు ఆదివారం బాలానగర్ ట్రాఫిక్ పోలీసులు ఫోన్ చేసి బైక్ స్టేషన్ లో ఉన్నట్లుగా సమాచారం అందించారు. దీంతో విజయ్ కుమార్ స్టేషన్ కు వెళ్లి బైక్ తీసుకొని తన తమ్ముడు రాజేష్ గురించి ఆరా తీయగా తమకు బైక్ మాత్రమే నో పార్కింగ్ ఏరియాలో ఉండడంతో స్టేషన్ కు తీసుకొచ్చామని పోలీసులు వెల్లడించారు. అనంతరం విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకొని రాజేష్ కోసం గాలిస్తున్నారు.

అమీర్ పేట్ లోని వెంగళరావు నగర్ కు చెందిన పామల చిన్నారావు టైల్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం తన కుమార్తె భవాని (22) టైలరింగ్ షాప్ వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారావు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.

ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం మనికేశ్వరా నగర్ కు చెందిన ఓం ప్రకాష్ ( 70) ఈనెల 3న ఉదయం అదే బస్తిలో ఉండే తన కుమార్తె వద్ద టిఫెన్ చేసి వస్తానని వెళ్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్