హైదరాబాద్‌లో దారుణం.. గాజులరామారంలో ఇద్దరు పిల్లల్ని కొడవలితో నరికి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య-mother commits suicide after killing two children in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో దారుణం.. గాజులరామారంలో ఇద్దరు పిల్లల్ని కొడవలితో నరికి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం.. గాజులరామారంలో ఇద్దరు పిల్లల్ని కొడవలితో నరికి చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య

Sarath Chandra.B HT Telugu

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని గాజులరామారంలో ఇద్దరు కుమారులను హతమార్చి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజుల రామారంకు చెందిన తేజస్విని రెడ్డి ఇద్దరు కొడుకుల్ని కొడవలితో నరికి చంపి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికుల్ని కలిచి వేసింది.

హైదరాబాద్‌లో విషాదం, కుమారుల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

మేడ్చల్‌ జిల్లా గాజుల రామారంలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో తల్లి కన్నబిడ్డలను హతమార్చి ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గాజుల రామారంకు చెందిన పదకొండేళ్ల రిషిత్ రెడ్డి, ఐదేళ్ల ఆశిష్‌ రెడ్డిలను కన్న తల్లి వేటకొడవలితో నరికి చంపి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలంలో పోలీసులు ఐదు పేజీల సూసైడ్ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.

గాజులరామారంకు చెందిన తేజస్విని రెడ్డి ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో మృతి చెందినట్టు మొదట ప్రచారం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకట్‌ రెడ్డి-తేజస్విని రెడ్డి దంపతులు కొంత కాలంగా గాజులరామారంలో ఉంటున్నారు.

తేజస్విని రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగోదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వెంకట్‌ రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లల్ని నరికి చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పిల్లలు తల్లి చేతిలో హత్యకు గురి కావడం స్థానికులను కలిచివేసింది. తల్లి దాడిలో గాయపడిన చిన్న కుమారుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. బాలానగర్‌ డీసీపీ ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.