తెలంగాణలో జరుగుతున్న మిస్ వర్డల్ పోటీలు తుది దశకు చేరాయి. రేపు (మే 31) తుది విజేతను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు కార్యక్రమం షురూ అవుతుంది.
ప్రపంచ అందాల పోటీల్లో భాగంగా…. సుమారు 20 రోజుల పాటు పలు కార్యక్రమాలు జరిగాయి. సుందరీమణులు పలు కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
108 మంది పోటీదారుల నుంచి 10 మంది సెమీ ఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మిగిలిన సెమీఫైనలిస్టులు వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత జడ్జ్ ల ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడతారు, మరియు ఫైనల్ షో సమయంలో వెల్లడిస్తారు. ఖండాల వారీగా టాపర్స్ ను ఎంపిక చేసి… ఆపై ఒకరిని కొత్త మిస్ వరల్డ్ గా ప్రకటిస్తారు. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (71వ మిస్ వరల్డ్) కొత్త మిస్ వరల్డ్ విజేతకు కిరీటం అందజేస్తారు.
మిస్ వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఫెస్టివల్గా ప్రతీయేటా నిలుస్తోంది. కేవలం అందానికి మాత్రమే ప్రాముఖ్యత కాకుండా…తెలివితేటలు, సామాజిక న్యాయం, సాంస్కృతిక మార్పిడి, నాయకత్వ లక్షణాల ద్వారా మహిళలను సాధికారతను చేస్తుందని నిర్వహకులు తెలిపారు.
సంబంధిత కథనం