Minister KTR Challenge: దమ్ముంటే మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి..?-minister ktr challenge to bjp and telangana over cm cm candidate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Ktr Challenge To Bjp And Telangana Over Cm Cm Candidate

Minister KTR Challenge: దమ్ముంటే మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి..?

HT Telugu Desk HT Telugu
Jun 01, 2023 04:25 PM IST

Minister KTR Latest News: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఛాలెంజ్ విసిరారు మంత్రి కేటీఆర్. దమ్ముంటే ఆ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందిస్తూ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

Minister KTR On BJP and Congress: తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో నీళ్లు, నిధులు, నియామకాలన్న స్పూర్తికి అనుగుణంగా పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. గురువారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఆయన... విద్యా వైద్య రంగంలో తెలంగాణ అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగిందని చెప్పారు. నూతన పాఠశాలలో, గురుకులాల ఏర్పాటు, మనఉరు మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్న ఆయన... గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, అగ్రవర్గాలు, అణగారిన వర్గాలు…ఇలా ఎలాంటి భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

"తెలంగాణలో పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా ముందుకు పోతున్నాయి. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రస్తుతమైన తనదైన మార్క్ వేయగలిగింది. తెలంగాణ అచరిస్తుంది దేశం అనుసరిస్తుంది… అన్నది ఈ రోజు నినాదంగా మారింది. ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది. ఈ రోజు తెలంగాణకు ప్రాబ్లమ్ అప్ ప్లెంటీ మెదలైంది. ఒకప్పుడు పంటలు పండని చోట నేడు దాన్యం ఎక్కువైన పరిస్ధితి నెలకొంది. ప్రతి పక్షాలకు పనిలేక తొమ్మిది ఎళ్లుగా అసత్య అరోపణలతో వాగుతున్నారు. ఒక్కసారి కూడా హేతుబద్దంగా, రుజువులతో మాట్లాడలేకపోయారు. దశాబ్దం పూర్తి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు… తెలంగాణ కాదని చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలనను బేరీజు వేసుకోండి ఎలాంటి పరిమితులు లేకుండా పండించిన పూర్తి ధాన్యాన్ని కొంటున్న రాష్ట్రం దేశంలో ఇంకొకటి ఎక్కడైనా ఉన్నదా..?" అనేది ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.

అది ఎంఐఎం ఇష్టం…

దమ్ముంటే కాంగ్రెస్, బిజెపి జాతీయ నాయకులు తెలంగాణ కంటే ఉత్తమ మోడల్ చూపిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. "ఈ రెండు పార్టీలు 75 సంవత్సరాలు చేయని పనిని, కేవలం 9 సంవత్సరాలు చేసి చూపిస్తున్నాం. ఆ రెండు పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుంది. కేంద్రమంత్రులు టాయిలెట్స్, రైల్వే స్టేషన్లలోని లిప్ట్ లు ఒపెన్ చేస్తున్నారు, మేము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తెలంగాణ రాష్ట్రం మైనార్టీలకు చేసిన కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన విషయం మర్చిపోవద్దు… ఇక్కడ మాట్లాడింది నిజమా…? అక్కడ మాట్లాడింది నిజమా? అయన తెల్చుకోవాలి. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది అ పార్టీ ఇష్టం. ప్రజలు మత ప్రాతికనే ఓట్లు వేస్తారని నేను నమ్మను. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనే లేదు. సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుంటారు. సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది నా వాదన కాదు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే నా వాదన" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలన్నారు కేటీఆర్. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండన్నాయని చెప్పారు. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాధి రాష్ట్రాలు నష్టపోకూడదని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని స్పష్టం చేశారు. "ఇప్పటినుంచే లోక్ సభ స్థానాలు పెంపు పైన ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఉచితాలు అనుచితంమంటూ, మేము పన్నుల చెల్లిస్తున్నామంటూ మాట్లాడుతున్న కొంతమంది, దేశంలో ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పన్నులు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాతో పోటీ పడే పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తామంటు కాంగ్రెస్ పార్టీ భ్రమల్లో ఉంటే అది వాళ్ళ ఇష్టం. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుంది. 90 నుంచి 100 స్థానాల్లో సులభంగా గెలుస్తుంది. మరోసారి మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నెక్స్ట్ ఎన్నికల్లో మా కేసీఆర్ గారు ఉంటారు… దమ్ముంటే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలి. కేవలం ఒక పార్టీని అధికారంలోకి దించాలన్న ఆలోచన విధానానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. దాని బదులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మంచి విధానాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలన్నదే మా లక్ష్యం" అని కేటీఆర్ స్పష్టం చేశారు.

దేశంలో కేవలం కాంగ్రెస్, బిజెపి మాత్రమే ఉన్నాయన్న ప్రచారం.. ఆలోచన విధానం తప్పు అని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వైపుల్యాల వల్లనే బిజెపి అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో లేదా దుకాణాన్ని నడపాలంటూ చురకలు అంటించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం