కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. కాల్పుల్లో 22మంది మావోయిస్టుల మృతి.. ఎన్‌కౌంటర్‌ ధృవీకరించిన బస్తర్ ఐజీ-massive encounter in karreguttala 22 maoists killed in firing bastar ig confirms encounter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. కాల్పుల్లో 22మంది మావోయిస్టుల మృతి.. ఎన్‌కౌంటర్‌ ధృవీకరించిన బస్తర్ ఐజీ

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. కాల్పుల్లో 22మంది మావోయిస్టుల మృతి.. ఎన్‌కౌంటర్‌ ధృవీకరించిన బస్తర్ ఐజీ

Sarath Chandra.B HT Telugu

తెలంగాణ-చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్ట కొండలలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో 22మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్‌ జరుపుతున్న సాయుధ బలగాలకు మావోయిస్టులు తారస పడటంతో ఎదురు కాల్పులు జరిగింది.

కర్రెగుట్ట కొండల్లో కాల్పుల్లో 22మంది మావోయిస్టుల మృతి (PTI)

తెలంగాణ-చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గత పక్షం రోజులుగా కర్రెగుట్టల్ని కేంద్ర సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు.

కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో గత కొన్ని రోజులుగా దాదాపు 24వేల మంది సాయుధ బలగాలు కొండల్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణ-చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో 90 కిలోమీటర్లకు పైగా పొడవున విస్తరించి ఉన్న కర్రెగుట్టల్ని అణువణువు తనిఖీ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో స్వల్ప సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి జవాన్లు గాయపడుతున్నారు. ఎండ తీవ్రతకు జవాన్లు అలసిపోతున్నారు. డీ హైడ్రేషన్ బారిన పడి అస్వస్థతకు గురవుతున్నారు.

మరోవైపు కాల్పులు విరమించి, చర్చలు జరపాలని మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో భార ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ ధృవీకరించారు. మృతులను గుర్తించాల్సి ఉంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం