తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!-light to moderate rains likely in telangana imd latest weather updates here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

తెలంగాణలో మరో నాలుగైదు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. ఇవాళ కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగైదు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… ఇవాళ(జూన్ 03)కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

జూన్ 4వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడొచ్చు. లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లుల పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 6 -10 కి.మీ వేగంతో వీచే అకాశం ఉంది.

ఏపీలో వాతావరణం ఇలా:

ఏపీలో ఇవాళ ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇక మన్యం,అల్లూరి,కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.