Vemulawada : మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..! వేములవాడలో కి'లేడీ' హోంగార్డ్ అరెస్ట్-lady home guard arrested in vemulawada ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada : మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..! వేములవాడలో కి'లేడీ' హోంగార్డ్ అరెస్ట్

Vemulawada : మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..! వేములవాడలో కి'లేడీ' హోంగార్డ్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Dec 05, 2024 03:30 PM IST

మహిళా హోంగార్డు "కి"లాడిగా మారింది. బ్లాక్ మెయిల్ తో మోసం చేసింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

వేములవాడ లో 'కి'లేడి హోంగార్డు అరెస్ట్
వేములవాడ లో 'కి'లేడి హోంగార్డు అరెస్ట్

ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనూష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసాలకు తెరలేపింది.‌ తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయ లేడి హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద 3 లక్షల 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చేప్పిన ఆ మాయ లేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మేయిల్ కు పాల్పడింది.

yearly horoscope entry point

మార్పింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్...

మహిళా హోంగార్డు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని శేఖర్ అడుగగా బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసి అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడుతానని బెదిరించింది. 

ఆ ఫొటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడి హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

గతంలో ఒకరి ఇలానే మోసం చేసింది- సిఐ వీర ప్రసాద్

మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసం చేయడం కొత్తేమికాదంటున్నారు పోలీసులు. గతంలో వేములవాడ కు చెందిన వ్యక్తి వద్ద 40 లక్షలు తీసుకుని మోసం చేయడంతో అప్పట్లో కేసు నమోదు అయిందని వేములవాడ సిఐ వీర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ పిర్యాదు తో అనూషపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సీఐ కోరారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner