Hyderabad Formula E Race Case : అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెట్టారు..? తేదీలతో సహా ఏం జరిగిందో చెప్పిన కేటీఆర్-ktr reaction after telangana acb books case against him in formula e race issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Formula E Race Case : అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెట్టారు..? తేదీలతో సహా ఏం జరిగిందో చెప్పిన కేటీఆర్

Hyderabad Formula E Race Case : అవినీతే లేదు, ఏసీబీ కేసు ఎలా పెట్టారు..? తేదీలతో సహా ఏం జరిగిందో చెప్పిన కేటీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 19, 2024 09:38 PM IST

ఫార్ములా ఈరేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అసలు ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదన్నారు. రేస్ రద్దు కావటానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన ప్రభుత్వం… అసలు విషయాలను దాచిపెడుతోందని చెప్పారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( ఫైల్ ఫొటో)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( ఫైల్ ఫొటో)

ఫార్ములా ఈరేసింగ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతి లేకుండానే… ఏసీబీ ఎలా కేసు నమోదు చేస్తుందని ప్రశ్నించారు. ఫార్ములా ఈరేసింగ్ లో ప్రభుత్వం కీలక విషయాలను దాచిపెట్టి… లీకులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం పెట్టిన కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

తెలంగాణలో ఎలక్ట్రిక్ పాలసీని మరింతగా ప్రమోట్ చేసే దిశగా ఫార్ములా ఈరేసింగ్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. ఆటో మొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వాహనాలకు తెలంగాణను కేంద్రంగా మార్చాలని భావించామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈరేస్ కు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 25 అక్టోబర్ 2023లో ఒప్పందం చేసుకున్నామని… వరుసగా 4 సార్లు రేస్ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో ఒక ప్రమోటర్ ను భాగం చేయాలనుకున్నామని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే… హైదరాబాద్ వేదికగా తొలి విడతగా ఈరేస్ నిర్ణయించామన్నారు. ఇది విజయవంతమైందని, చాలా మంది ప్రముఖలు కూడా వచ్చారని గుర్తు చేశారు.

కీలక విషయాలను చెప్పిన కేటీఆర్…

  • జూన్‌లో ప్రమోటర్‌ వెళ్లిపోయారని అరవింద్‌ కుమార్‌ నా వద్దకు వచ్చారు.. 3 ఆగస్టు 2023న మాకు ఓ ఈమెయిల్‌ వచ్చింది.
  • ఈరేస్ నిర్వహణకు ప్రమోటర్ దొరకపోవటంతో ఈరేస్ వాళ్ల నుంచి ఆగస్టు 03 2023 హెచ్ఎండీఏకు లేఖ వచ్చింది. ప్రమోటర్ లేకపోటే 2024 జరగాల్సిన ఈవెంట్ ఉండదని స్పష్టం చేసింది. ఆగస్టు 16 2023లోపు ఏదో ఒకటి చెప్పాలని ఫార్ములా ఈరేస్ పేర్కొంది.
  • ఫార్ములా ఈరేస్ లేఖ నేపథ్యంలో ప్రమోటర్ లేకపోతే రేస్ నిర్వహణకు ఇబ్బంది రావొద్దని భావించాం. హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్ల చెల్లించాలని నిర్ణయించాం. ఇదే విషయాన్ని అర్వింద్ కుమార్ కు చెప్పాను.
  • ఈ డబ్బులను రెండు ధపాలుగా చెల్లించాం. 5 అక్టోబర్ 2023వ తేదీన ఒకటో దఫా, అక్టోబర్ 11 2023వ తేదీన రెండో దఫాలో చెల్లించాం. అక్టోబర్ 19 2023 నుంచి ఫార్ములా ఈరేస్ నుంచి ప్రకటన జారీ చేసింది. రేస్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ క్లియర్ అయింది.
  • అక్టోబర్ 27, 2023వ తేదీన మొదటి విడతలో ఉన్న స్పాన్సర్ గాఉన్న గ్రోన్ కో ఎగ్జియ్ అయింది.
  • డిసెంబర్ 7, 2023వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
  • ఫార్ములా ఈ రేస్ చీఫ్ 13 డిసెంబర్ 2023 సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. రేస్ నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది. డిసెంబర్ 19, 2023 ఈరేస్ కో ఫౌండర్ అల్బర్టో నుంచి హెచ్ఎండీఏకు లేఖ కూడా అందింది. వచ్చే మూడేళ్లు కూడా రేస్ ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఇదే విషయంపై డిసెంబర్ 21, 2023 లోపు జవాబు ఇవ్వాలని లేఖలో తెలిపారు.
  • 22 డిసెంబర్ 2023వ తేదీన ఫార్ములా ఈరేస్ లీగల్ డైరెక్ట్ ఉత్తరం రాశారు. కాంట్రాక్ట్ బీచ్ జరిగిందని పేర్కొన్నారు. మూడో విడత నిధులు కట్టలేదని ప్రస్తావించారు. మిగిలిన డబ్బులు చెల్లించకపోతే ఎఫ్ఈవో అగ్రిమెంట్ రద్దు చేసుకుంటుందని పేర్కొన్నారు. ఇందుకు 26 డిసెంబర్ 2023వ తేదీని గడువుగా పేర్కొన్నారు.
  • లైసెన్స్ ల కోసం రూ. 77 లక్షలు కూడా చెల్లించాం. అయితే కాంట్రాక్ట్ రద్దు కావటంతో ఈ డబ్బులు ఇవ్వటానికి ఎఫ్ఈవో సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పింది. కానీ ప్రభుత్వమే ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు.
  • ఇలాంటి కీలక విషయాన్నీ బయటికి చెప్పకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అసలు ఈకేసులో ఎలాంటి అవినీతి జరగలేదు.అలాంటప్పుడు ఏసీబీ ఎలా కేసు నమోదు చేస్తుంది…? ఈ కేసులో న్యాయపరంగా పోరాడుతాం. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం.
  • కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది" అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం