రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలా మంది ఎదరు చూస్తున్నారు. ఈ స్కీమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోగా... ప్రస్తుతం ప్రభుత్వం యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుపుతోంది. సంక్రాంతిలోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలోని సర్వేయర్లు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ సర్వేతో పాటు లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. లక్షలాది దరఖాస్తులు రావటంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాల్ గా మారింది. ఈ క్రమంలోనే సాంకేతికతో కూడా యాప్ సర్వేను చేస్తున్నారు. ఈ సర్వే తర్వాత... అర్హుల ఎంపిక వరకు ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి...
సంబంధిత కథనం