వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దరఖాస్తుల గడువు ముగియటంతో అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30, 2024 తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించారు. మొత్తం 33 కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యూకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో పాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.
మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే తుది గడువును కూడా పొడిగించారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో చేరవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు https://online.braou.ac.in / వెబ్ సైట్ లోకి వెళ్లి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు. మీ విద్యా అర్హతలు బట్టి కోర్సులను ఎంచుకోవచ్చు.