Jagtial News : మరికొన్ని గంటల్లో పెళ్లి, ఇంతలో అక్క మొగుడితో పెళ్లి కూతురు జంప్!
Jagtial News : కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కూతురు షాక్ ఇచ్చింది. సొంత అక్క భర్తతో కలిసి పారిపోయింది. బంధువులు యువతి కోసం వెతకగా.. వారి ఆచూకీ దొరకలేదు. చెల్లి, భర్త చేసిన పనికి అక్క లబోదిబోమంటుంది.
Jagtial News :వివాహేతర సంబంధాలు కాపురాలను కూలుస్తున్నాయి. కొన్నిసార్లు ఎంతటి దారుణానికై పాల్పడేలా చేస్తున్నాయి. పెళ్లై పిల్లలున్నా.. మరొకరిపై వ్యామోహంతో అందమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథలు చేస్తూ చివరకు జైలు పాలవుతున్నారు. జగిత్యాల జిల్లాలో సొంత అక్క కాపురం కూల్చిందో చెల్లి. మరికాసేపట్లో పెళ్లి అనగా.. అక్క భర్తతో కలిసి పరారైంది.
ట్రెండింగ్ వార్తలు
అసలేం జరిగింది?
జగిత్యాల గ్రామీణ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతికి మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. పెద్దలందరూ మాట్లాడుకుని ఆదివారం పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కన్నాపూర్ లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇంతలో పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. ఉదయం 4 గంటల సమయంలో పెళ్లి కూతురు మరో వ్యక్తితో పారిపోయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...పెళ్లి కూతురు తన అక్క మొగుడు వరసకు బావ అయ్యే వ్యక్తితో పారిపోవడం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతి కోసం వెతికారు. పెళ్లి కూతురు ఆచూకీ దొరకకపోవడంతో... జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
సొంత అక్క భర్తతో పరారీ
పెళ్లి పీటల దాకా వచ్చి ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే ఈ పెళ్లి ఆగిపోడవం పెద్ద ట్విస్ట్ ఉంది. పెళ్లి కూతురు స్వయాన అక్క భర్తతో పారిపోవడంతో కుటుంబ సభ్యులకు మింగుడుపడడం లేదు. పెళ్లి ఆగిపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే ముందుగానే చెప్పొచ్చుగా అని యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెళ్లి కొడుకు బంధువులు. సొంత చెల్లెలే తన భర్తతో పారిపోవడంతో ఆ అక్క జీర్ణించుకోలేకపోతోంది. భర్త, చెల్లెలు చేసిన పనికి షాక్ లో ఉండిపోయింది.
తాగివచ్చి పెళ్లి చెడగొట్టుకున్న వరుడు
పీటల దాకా వచ్చిన పెళ్లిన ఓ ఘనుడు చేజేతులా చెడగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లా మాణిక్ పుర్ లో ముహూర్తం సమయానికి వరడు ఫూటుగా తాగివచ్చాడు. అనంతరం వధువుపై సింధూరం చల్లాడు. దీంతో ఆ యువతి పెళ్లి మండపం నుంచి లేచివెళ్లిపోయింది. యువకుడిని పెళ్లి చేసుకోడానికి నిరాకరించింది. పెళ్లి కొడుకు ఊరేగింపు క్రమంలో మద్యం తాగాడు. తాగిన మైకంలో పెళ్లితంతులో వధువుకు బొట్టు పెట్టలేక మీద పడేశాడు. వధువుపై సింధూరాన్ని చల్లడం, ఆపేందుకు ప్రయత్నించిన వధువుపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన తర్వాత ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాలి. పోలీసుల సమక్షంలో వివాహ ఖర్చులు చెల్లించడానికి వరుడి కుటుంబం ఒప్పుకుంది.