Hyderabad : రెండో రోజు ఐటీ సోదాలు.. హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు!-it searches continue for second day at sri chaitanya educational institutions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : రెండో రోజు ఐటీ సోదాలు.. హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు!

Hyderabad : రెండో రోజు ఐటీ సోదాలు.. హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు!

Hyderabad : శ్రీచైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ తోపాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా నగదు లభించినట్టు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

శ్రీచైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు! (istockphoto)

హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థల్లో.. ఐటీ అధికారులు రెండో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

దేశవ్యాప్తంగా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్‌వేర్లను పరిశీలించారు. విద్యా సంస్థలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

పన్ను ఎగవేయడానికి..

పన్ను ఎగవేయడానికి రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇలా వసూలు చేసిన ఫీజులకు సంబంధించి ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఐటీ సోదాల్లో బయటపడినట్టు సమచారం.

2020 లోనూ..

హైదరాబాద్ మాదాపూర్‎లోని శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్‎లో తనిఖీలు రెండోరోజు కొనసాగుతున్నాయి. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజా సోదాల్లోనూ రూ.5 కోట్లు నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతోన్న దాడులపై ఐటీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ.. భారీగా డబ్బు పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి.