కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పోచారం ప్రాజెక్టు అతి భారీస్థాయిలో వరద తరలివచ్చింది. ఊహించని దానికంటే ప్రాజెక్ట్ పైనుంచి నీరు దాటిగా ప్రవహిస్తూ వెళ్లింది.
ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పక్కన గుంత పడటంతో…. ప్రాజెక్ట్ తెగిపోయే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపించాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా భయాందోళనను వ్యక్తం చేశారు. అయితే అతి భారీ వరదను కూడా తట్టుకొని ఈ ప్రాజెక్ట్ నిలబడింది. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ శాఖ ప్రకటించింది.
103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుంది సురక్షితంగా నిలబడిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు MFD 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువని తెలిపారు. బుధవారం నాటి భారీ వరదను తట్టుకొని నిలబడటం… గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ, భావోద్వేగ సమయమని తెలిపారు.
సంబంధిత కథనం