శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలకు కొత్త టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!-irctc tourism to operate tirumala tour package from karimnagar details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలకు కొత్త టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలకు కొత్త టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!

తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. కరీంనగర్ టౌన్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ట్రిప్ జూన్ 19వ తేదీన అందుబాటులో ఉంది. ముఖ్య వివరాలను ఇక్కడ తెలుసుకోండి....

కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ

వేర్వేరు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా కరీంనగర్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'TIRUPATI FROM KARIMNAGAR' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ఈ ప్యాకేజీ జూన్ 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చూడొచ్చు. కరీంనగర్ తో పాటు వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.

టూర్ షెడ్యూల్ ఇలా…

  • కరీంనగర్ నుంచి (ట్రైన్ నెంబర్ 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం వద్ద 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.
  • ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెష్ అప్ అవుతారు. అక్కడ్నుంచి తిరుచానూరు వెళ్తారు. శ్రీకాళహస్తి దర్శనం ఉంటుంది. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.
  • తెల్లవారుజామునే తిరుమలకు చేరుకుంటారు. క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • తెల్లవారుజామున ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు:

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 14,030ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 10,940ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.9160గా ఉంది. కంఫ్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. స్టాండర్ట్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7250, డబుల్ షేరింగ్ కు రూ. 9030, సింగిల్ షేరింగ్ కు రూ. 12120గా నిర్ణయించారు.

ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదింవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.