తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి. టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే అనేక ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా షిర్డీకి ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా… నాసిక్ కూడా చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 8, 2024 తేదీన అందుబాటులో ఉంది. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7970,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7780గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 8170గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 6290 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6110 ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం