IRCTC Hyd Ooty Tour : ఊటీ వెళ్తారా..? తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్, ఈ కొత్త ప్యాకేజీ చూడండి-irctc tourism announed latest ooty and coonoor tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announed Latest Ooty And Coonoor Tour Package From Hyderabad

IRCTC Hyd Ooty Tour : ఊటీ వెళ్తారా..? తక్కువ ధరలోనే 6 రోజుల ట్రిప్, ఈ కొత్త ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 04:54 PM IST

IRCTC Hyd erabad- Ooty Tour Package : మండే వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ధరలోనే ఆఫర్ చేస్తోంది.

ఊటీ
ఊటీ (unsplash.com)

IRCTC Tourism Ooty Package: వేసవి వచ్చేసింది...! చాలా మంది టూరిస్టులు కొత్త కొత్త ప్లేస్ లను చూసేందుకు ప్లాన్ చేసే పనిలో ఉంటారు. కొందరైతే అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటారు. మరికొందరు మాత్రం కేవలం సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మే 9వ తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఫస్ట్ డే ఊటీ టూర్ ప్యాకేజీ(Ooty Tour Package)లో భాగంగా హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. రాత్రి అంతా జర్నీ చేయాలి. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్(Railway Station) కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు:

కొత్త టూర్ ప్యాకేజీ(Ooty Tour Package) ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,220గా ఉంది. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా నిర్ణయించారు. ఈ ధరలు జూన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. పూర్తిగా ధరల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూడొచ్చు. ఈ www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

టికెట్ రేట్ల వివరాలు
టికెట్ రేట్ల వివరాలు (www.irctctourism.com)
IPL_Entry_Point

సంబంధిత కథనం