IRCTC Tourism: IRCTC సరికొత్త ప్యాకేజీ.. 5 వేల ధరలో ఈ 5 ఆలయాలకు వెళ్లి రావొచ్చు-irctc tourism announced poorva sandhya tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Poorva Sandhya Tour Package From Hyderabad

IRCTC Tourism: IRCTC సరికొత్త ప్యాకేజీ.. 5 వేల ధరలో ఈ 5 ఆలయాలకు వెళ్లి రావొచ్చు

HT Telugu Desk HT Telugu
May 03, 2023 08:32 PM IST

IRCTC Poorva Sandhy Tour: : హైదరాబాద్ నుంచి తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి వెళ్లాలనుకునే వారి కోసం గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ‘పూర్వసంధ్య’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంది. ఆ వివరాలు చూస్తే….

పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ
పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ (www.irctctourism.com)

IRCTC POORVA SANDHYA Tour: తిరుపతి(Tirupati)తోపాటుగా చుట్టు పక్కల ఆలయాలకు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ‘పూర్వ సంధ్య’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రైలు మార్గంలో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు చూడొచ్చు. సికింద్రాబాద్ లో టూర్ ప్రారంభవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ మే 11వ తేదీన అందుబాటులో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Day 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటల నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 2 : తిరుపతి(Tirupati)కి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.

Day 3 : అల్పాహారం చేసి.. హోటల్‌(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి(దర్శనం రద్దీపై ఆధారపడి ఉంటుంది). సాయంత్ర 06:25 గంటలకు రైలు ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్‌(Tirupati Railway Station) నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 4 : నల్గొండ(Nalgonda)కు 03:04 గంటలకు చేరుకుంటారు. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

పూర్వ సంధ్య టూర్ ధరల వివరాలు
పూర్వ సంధ్య టూర్ ధరల వివరాలు (www.irctctourism.com)

ప్యాకేజీ ధరలు చూస్తే…. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5660గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510 గా నిర్ధారించారు. ఈ www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం