IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు ప్రముఖ దేవాలయాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై [అరుణాచలం] - రామేశ్వరం - త్రివేండ్రం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL తరగతులలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంది. 9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250.
దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది.
బోర్డింగ్ / డి-బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.
ఎకానమీ -రూ 14250(పెద్దలకు)- రూ 13250( పిల్లలకు(5-11 సంవత్సరాలు))
స్టాండర్డ్- రూ 21900- రూ 20700
కంఫర్ట్- రూ 28450- రూ 27010
సంబంధిత కథనం