చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి మరో ముహుర్తం ఖారారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. ఈసారి మాత్రం పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి డిసెంబర్ 28వ తేదీనే ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినప్పటికీ.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిచెందడంతో కార్యక్రమం వాయిదా పడింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా తెలిపారు. అయితే ఈ జనవరి 6వ తేదీన కొత్త టెర్మినల్ ను ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం వర్చువల్గా హాజరై… రైల్వే టెర్మినల్ను ప్రారంభిస్తారని తెలిసింది.
ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే… రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.