ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీతో గడువుగా ముగిసిన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం గడువు పొడిగించలేదు.
అర్హులైన అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్లోనే నేరుగా చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం మొత్తం 17 రకాల డిగ్రీ ప్రోగ్రామ్స్ను ఆఫర్ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ప్రాంతీయ కేంద్ర పరిధిలోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సుల వివరాలు, ఫీజులు, పరీక్షల విధానం వంటి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. మరోసారి దరఖాస్తుల గడువును పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.