Hyderabad Water Cut: హైదరాబాద్ వాసులకు అలర్ట్- ఈ నెల 17, 18న తాగునీటి సరఫరాలో అంతరాయం
Hyderabad Water Cut: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ సమయంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు.

Hyderabad Water Cut: హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతు పనులు చేయనున్నారు. ఈ పనులు 17.02.2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18.02.2025 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని జలమండలి అధికారులు తెలిపారు. కాబట్టి ఈ 24 గంటలు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
మంచి నీటి సరఫరా అంతరాయం కలిగే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.
2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రినగర్, బాబా నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.
3. ఓ అండ్ ఎం డివిజన్-12 : చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.
4. ఓ అండ్ ఎం డివిజన్-13 : అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్ పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.
5. ఓ అండ్ ఎం డివిజన్-14 : చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా.
6. ఓ అండ్ ఎం డివిజన్-15 : కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).
7. ఓ అండ్ ఎం డివిజన్-17 : హఫీజ్ పేట్, మియాపూర్.
8. ఓ అండ్ ఎం డివిజన్-21 : కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.
9. ఓ అండ్ ఎం డివిజన్-22 : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.
10. ట్రాన్స్ మిషన్ డివిజన్-4 : ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.
11. ఆర్ డబ్ల్యూఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు : ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్).
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.
సంబంధిత కథనం