Sanath Nagar Geyser Incident : హైదరాబాద్ సనత్ నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్ రూమ్ లో విగతజీవులుగా పడి ఉన్న ఘటన సంచలనం రేపింది. వీరు చనిపోవడానికి గీజరే కారణమని తెలుస్తోంది. గ్యాస్ ఆధారిత హీటర్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు వారి ప్రాణాలను తీసినట్లు వైద్యుల ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ముగ్గురు వ్యక్తులు రంగులేని, రుచి, వాసన లేని వాయువును పీల్చారని, ఐదు నిమిషాల్లో వారు అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఆటిజంతో బాధపడుతున్న కుమారుడు హరికృష్ణ (25) అతని తల్లిదండ్రులు వెంకటేశ్, మాధవి రోజూ స్నానం చేయిస్తారు. అయితే ఆదివారం బాత్ రూమ్ లో ముగ్గురూ అపస్మారక స్థితి పడి ఉన్నారు. బాత్రూమ్లోని గ్యాస్ గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయి, వీరు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు.
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సనత్ నగర్ జీక్ కాలని ఆకృతి అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ముగ్గురి మృతదేహాలు బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాయి. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆకృతి అపార్ట్మెంట్స్ రెండో అంతస్తులో నివాసం ఉంటున్న ఆర్. వెంకటేష్ (40), మాధవి(50), హరకృష్ణ (30).....ఆదివారం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు కనిపించలేదు. సాయంత్రం మూడున్నర ప్రాంతంలో వచ్చినప్పుడు కూడా పని మనిషికి ఎవరూ కనిపించలేదు. ఇంటి డోర్లు తీసే ఉన్నా.....ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో పనిమనిషి ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. దీంతో పక్క ప్లాట్ వాళ్లు వచ్చి ఇళ్లంతా చూడగా బాత్రూంలో ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు.
దీంతో వారి సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత గీజర్ వల్ల వాటర్ ట్యాప్ కు విద్యుత్ సరఫరా అవ్వడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చ అని పోలీసులు భావించినా......తరువాత కి అలాంటి ఆనవాళ్లు ఏమి కనిపించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టైం ద్వారా ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం