Case Filed On Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై ఎట్టకేలకు కేసు నమోదు, మరో ట్విస్ట్ వెలుగులోకి!-hyderabad narsingi police filed case on hero raj tarun on lavanya complaint alleged abortion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Case Filed On Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై ఎట్టకేలకు కేసు నమోదు, మరో ట్విస్ట్ వెలుగులోకి!

Case Filed On Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై ఎట్టకేలకు కేసు నమోదు, మరో ట్విస్ట్ వెలుగులోకి!

Case Filed On Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి, మోసం చేశారని లావణ్య అనే యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు ఫైల్ చేశారు.

హీరో రాజ్ తరుణ్ పై ఎట్టకేలకు కేసు నమోదు, మరో ట్విస్ట్ వెలుగులోకి!

Case Filed On Raj Tarun : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సహ జీవనం చేసిన తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదుతో పోలీసులు 420, 506, 493 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. హీరో రాజ్‌తరుణ్‌, తాను 2012 నుంచి ప్రేమించుకుంటున్నామని, కొన్ని రోజులు ఒక గదిలో ఉంటూ సహజీవనం చేశామని, ఇటీవల ఓ సినీనటితో రాజ్ తరుణ్ సన్నిహితంగా ఉంటున్నాడని లావణ్య నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. అనంతరం అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. లావణ్య డ్రగ్స్ కు అలవాటు పడి తనను వేధించేదని రాజ్ తరుణ్ ఆరోపించారు.

అబార్షన్ చేయించారు

తాజాగా మరో విషయాన్ని లావణ్య బయటపెట్టింది. 10 ఏళ్ల క్రితమే తమకు వివాహం అయ్యిందని, ఇద్దరం కలిసే జీవిస్తున్నామని చెప్పింది. దీంతో పాటు కొన్నాళ్ల క్రితం తనకు అబార్షన్ కుడా చేయించారని తెలిపింది. మరో సినీ నటితో సంబంధం కొనసాగిస్తూ రాజ్ తరుణ్ తనను దూరం పెట్టారని లావణ్య ఆరోపిస్తుంది. తనను సంబంధం లేని కేసులో ఇరికించడంతో తాను 43 రోజులు జైల్లో ఉన్నానని వాపోయింది. రాజ్ తరుణ్ తనను మారుపేరుతో విదేశాలకు తీసుకెళ్లారని లావణ్య ఆధారాలను పోలీసులకు చూపించారు. లావణ్య ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్‍తో కలిసి ఉన్నానని లావణ్య వెల్లడించారు. అన్విక పేరుతోనే తాను అతడితో విదేశాలకు వెకేషన్లకు కూడా వెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. మాల్వీ మల్హోత్రా పరిచయం అయినప్పటి నుంచి తనను రాజ్‍తరుణ్ దూరం పెట్టినట్టు లావణ్య పేర్కొన్నారు. ఈ కొత్త ఫిర్యాదుతో పాటు కొన్ని ఫొటోలు, వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్లు, స్కీన్‍షాట్లను కూడా పోలీసులకు లావణ్య ఇచ్చారని తెలుస్తోంది. నటి మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్‍తరుణ్ వదిలేశారని లావణ్య ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇటీవలే స్పందించారు. లావణ్య చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలు అని చెప్పారు. తాము కొంతకాలం రిలేషన్‍లో ఉన్నా పెళ్లి చేసుకోవాలని ఎప్పడూ అనుకోలేదని అన్నారు. లావణ్య డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, చెప్పినా వినకపోవటంతో తాను విడిపోయానని రాజ్ తరుణ్ చెప్పారు.

హీరోయిన్ మాల్వీ ఫిర్యాదు

మరోవైపు ఈ వివాదంపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా స్పందించారు. లావణ్య తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని పోలీసులను ఆశ్రయించారు. హీరో రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడలేదన్నారు. లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య ఇలానే వేధిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ అంటున్నారు. తన బంధువులు ఎవరూ లావణ్యను బెదిరించడం లేదన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్న లావణ్యపై చర్యలు తీసుకోవాలని మాల్వి తన ఫిర్యాదులో పోలీసులను కోరారు. తనను, తన సోదరుడిని లావణ్య వేధిస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత కథనం