‌Hyd Gang Rape : హైదరాబాద్‌లో ఘోరం… బాలికపై సామూహిక అత్యాచారం…-hyderabad high hayatnagar govt high school students raped minor girl ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad High Hayatnagar Govt High School Students Raped Minor Girl

‌Hyd Gang Rape : హైదరాబాద్‌లో ఘోరం… బాలికపై సామూహిక అత్యాచారం…

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 12:43 PM IST

Hyd Gang Rape హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అదే స్కూల్లో చదువుతున్న మరో బాలికపై నాలుగు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది. విద్యార్ధినిని బెదిరించి ఒకరి తర్వాత మరొకరుగా దారుణానికి ఒడికట్టారు.

మానసిక ఎదుగుదల లేని బాలికపై హైస్కూల్ విద్యార్ధుల అత్యాచారం
మానసిక ఎదుగుదల లేని బాలికపై హైస్కూల్ విద్యార్ధుల అత్యాచారం (HT_PRINT)

Hyd Gang Rape హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. హ‍యత్‌నగర్‌ తట్టిఅన్నారం వైఎస్సార్‌ కాలనీలో ఈ ఘోరం వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికను బెదిరించి విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని ఫోన్లో రికార్డు చేసి మిత్రులకు షేర్ చేశారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి ఆ వీడియోలు చేరి, బాలికపై నెలల తరబడి అకృత్యాలకు పాల్పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరబాద్‌ తట్టిఅన్నారం వైఎస్సార్‌ కాలనీలో మానసిక ఎదుగుదల సరిగా లేని బాలికపై ప్రభుత్వ హైస్కూల్ విద్యార్ధులు దారుణానికి పాల్పడ్డారు. బాధిత బాలిక యుక్తవయసుకు వచ్చినా మానసిక ఎదుగుదల లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ విద్యార్ధి ఈ ఏడాది ఆగష్టులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత మరికొందరు స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారానికి పాల్పడిన విద్యార్ధి వీడియోను తన మిత్రులకు షేర్ చేయడంతో మరో బృందం విద్యార్ధులు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే ఆమెను హతమారుస్తామని బెదిరించారు. ఇలా నాలుగు నెలలుగా జరుగుతోంది. తట్టి అన్నారం వైఎస్సార్ కాలనీలో చదువుతున్న 20మంది హైస్కూల్ విద్యార్ధులకు ఈ వీడియోలను షేర్‌ చేశారు. రెండు మూడు గ్రూపులు బాధిత విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్పొద్దని ఆమెను తీవ్రంగా బెదిరించాడు. విద్యార్ధిని ఆందోళనకు గురవడంతో తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం కోసం స్థానిక కౌన్సిలర్‌ను ఆశ్రయించడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన విద్యార్ధులు స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతుంటారని గుర్తించారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్ధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై పోస్కో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. బాధితకుటుంబం ఆర్నెల్ల క్రితమే వైఎస్సార్‌ కాలనీకి వచ్చింది.స్థానికులతో పెద్దగా పరిచయాలు లేకపోవడాన్ని విద్యార్ధులు అలుసుగా తీసుకున్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులు ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. ఇంట్లో బాలిక ఒక్కటే ఉండటం గమనించి ఆమెపై దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

IPL_Entry_Point