హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు "ఆపరేషన్ అభ్యాస్" పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సిటీ వ్యాప్తంగా సైరన్లు మోగించనున్నారు. సైరన్ మోగగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
రేపు సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్ లోని నాలుగు చోట్ల అంటే సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీవో, మౌలాలి ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
పౌరుల రక్షణ బాధ్యతలో భాగంగా శత్రు దాడి జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7 సాయంత్రం 4 గంటలకు ప్లాన్ చేశారు. దేశంలోని 244 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది.
హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పన్నెండు సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ మాక్ డ్రిల్ను నిర్వహిస్తాయి.
సంబంధిత కథనం