రేపు హైదరాబాద్ లో డిఫెన్స్ మాక్ డ్రిల్- సైరన్ మోగగానే ప్రజలు ఏంచేయాలంటే?-hyderabad defense mock drill operation abhyas tomorrow things people should follow ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేపు హైదరాబాద్ లో డిఫెన్స్ మాక్ డ్రిల్- సైరన్ మోగగానే ప్రజలు ఏంచేయాలంటే?

రేపు హైదరాబాద్ లో డిఫెన్స్ మాక్ డ్రిల్- సైరన్ మోగగానే ప్రజలు ఏంచేయాలంటే?

హైదరాబాద్ నగరంలో రేపు సాయంత్రం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగించనున్నట్లు పేర్కొన్నారు. సైరన్ మోగగానే ప్రజలు ఎలక్ట్రికల్‌ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు ఆపేయాలని సూచించారు.

రేపు హైదరాబాద్ లో డిఫెన్స్ మాక్ డ్రిల్- సైరన్ మోగగానే ప్రజలు ఏంచేయాలంటే?

హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు "ఆపరేషన్‌ అభ్యాస్‌" పేరుతో డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సిటీ వ్యాప్తంగా సైరన్లు మోగించనున్నారు. సైరన్‌ మోగగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.

నాలుగు చోట్ల

రేపు సాయంత్రం 4.15 గంటలకు హైదరాబాద్ లోని నాలుగు చోట్ల అంటే సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీలో డిఫెన్స్ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు.

పోలీసులు, ఫైర్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

ప్రజలకు ముఖ్య సూచనలు

  1. డిఫెన్స్ మాక్‌ డ్రిల్‌లో 12 సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులు పాల్గొననున్నాయి.
  2. రేపు సాయంత్రం 4 గంటలకు నాలుగు ప్రాంతాల్లో ఎయిర్‌ రైడ్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు.
  3. రేపు సాయంత్రం 4 గంటలకు నగరమంతా రెండు నిమిషాల పాటు సైరన్లు మోగించనున్నారు.
  4. సైరన్‌ రాగానే ఎలక్ట్రికల్‌ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు ఆపేయాలని అధికారులు సూచించారు.
  5. డ్రిల్ సమయంలో దృఢమైన లేదా అండర్ గ్రౌండ్ ప్రాంతాల్లో ప్రజలు షెల్టర్ తీసుకోవాలి.
  6. నమ్మకమైన మీడియా ద్వారా అప్డేట్స్ తెలుసుకోవాలి.
  7. ఆల్ క్లియర్ అనే సందేశం వచ్చే వరకు ప్రజలు ఎక్కడికి వెళ్లకూడదు.
  8. సాయంత్రం 4.15 గంటలకు భద్రతా దళాలు ఎయిర్ రైడ్ డ్రిల్ నిర్వహిస్తాయి.
  9. సాయంత్రం 4.30 గంటలకు డ్రిల్ పూర్తి అవుతుంది.

పౌరుల రక్షణ బాధ్యతలో భాగంగా శత్రు దాడి జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ అనే కోడ్ పేరుతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ మే 7 సాయంత్రం 4 గంటలకు ప్లాన్ చేశారు. దేశంలోని 244 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో హైదరాబాద్ నగరం కూడా ఉంది.

హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పన్నెండు సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం