హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మిస్ వరల్డ్-2025 ప్రారంభం కార్యక్రమాలు నిర్వహించారు. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయ్యాయి. 250 మంది కళాకారులతో కన్నుల పండుగగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీల్లో వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల కంటెస్టెంట్స్ పాల్గొనున్నారు. స్టేడియం, కంటెస్టెంట్లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
మిస్ వరల్డ్ ప్రారంభ కార్యక్రమంలో లాటిన్ అమెరికా దేశాల కంటెస్టెంట్స్ తమ దేశీయ ఆహార్యంతోపాటు సంస్కృతి, సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆఫ్రికన్ దేశాలకు చెందిన 22 కంటెస్టెంట్స్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారుల ప్రదర్శన విదేశీ అతిథులను ఆకర్షించింది.
మొదట అర్జెంటీనా కాంటెస్టెంట్ ర్యాంప్ పైకి వచ్చారు. ఆ తర్వాత కరేబియన్ లాటిన్ అమెరికా పోటీదారులు ర్యాంప్ పైకి వచ్చారు. రెండో రౌండ్ కంటెస్టెంట్స్ ఆఫ్రికా ఖండం నుంచి అంగోలాతో మొదలైంది.
మొదట అర్జెంటీనా కాంటెస్టెంట్ ర్యాంప్ పైకి వచ్చారు. ఆ తర్వాత కరేబియన్ లాటిన్ అమెరికా పోటీదారులు ర్యాంప్ పైకి వచ్చారు. రెండో రౌండ్ కంటెస్టెంట్స్ ఆఫ్రికా ఖండం నుంచి అంగోలాతో మొదలైంది.
తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పాశ్చాత్య కళల మేళవింపుగా మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం సాగింది. లంబాడా కళాకారులు డప్పు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు అతిథులు, ఆహుతులు కరతాళ ధ్వనులు చేశారు.
మూడో రౌండ్ కంటెస్టెంట్స్ యూరప్ ఖండం నుంచి అల్బేనియా ప్రతినిధితో మొదలైంది. మొత్తం 32 దేశాలు యూరప్ నుంచి ప్రాతినిధ్యం వహించాయి. వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు.
ఆ తర్వాత జరిగిన ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ జెండాతో కళాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. చివరి రౌండ్ కంటెస్టెంట్స్ ఆసియా ఓషియానియా నుంచి ర్యాంపు పైకి వచ్చారు. మొత్తం 22 దేశాలు నుంచి కంటెస్టెంట్స్ ప్రాతినిధ్యం వహించారు. వారి సంస్కృతి సాంప్రదాయాలను తమదైన శైలిలో ప్రదర్శించారు.
మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు స్టేడియం కరతాళ ధ్వనులతో మారుమోగింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా "తెలంగాణ జరూర్ ఆనా" నినాదంతో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవాన్ని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు.
దాదాపు 120 దేశాల ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకుని రిహార్సల్స్ పూర్తి చేశారు. భారత్ నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాల మేళవింపుగా మూడు వారాల పాటు మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరగనున్నాయి.
మిస్ వరల్డ్-2025 కంటెస్టెంట్స్ వరంగల్, పోచంపల్లి, బుద్ధవనం, యాదగిరిగుట్ట, మహబూబ్నగర్ ప్రాంతాల సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్ వద్ద హెరిటేజ్ వాక్ లో సుందరీమణులు పాల్గొంటారు.
సంబంధిత కథనం