మీ ఆహార భద్రత కార్డులో మార్పులా....? ఇలా అప్లికేషన్ చేసుకోండి-how to make changes to your food security card know these key details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మీ ఆహార భద్రత కార్డులో మార్పులా....? ఇలా అప్లికేషన్ చేసుకోండి

మీ ఆహార భద్రత కార్డులో మార్పులా....? ఇలా అప్లికేషన్ చేసుకోండి

ఆహార భద్రత కార్డులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. దగ్గర్లోని మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. కొత్తగా పేర్లు నమోదుతో పాటు ఇంకా ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు.

ఆహార భద్రత కార్డులో మార్పులు, చేర్పులు

మీకు ఆహార భద్రత కార్డు ఉందా…? అందులో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా..?అయితే ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మీకు దగ్గర్లో ఉండే మీసేవా కేంద్రం వద్దకు వెళ్లి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అధికారులు పరిశీలించిన తర్వాత…. పేర్లు నమోదవుతాయి.

ఇప్పటికే జారీ అయిన కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు ముందుగా దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేయాలి. మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… పూర్తి వివరాలతో కూడిన ఫామ్ ను ఇస్తేనే ప్రక్రియను పూర్తి చేస్తారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ముందుగా తెలంగాణ మీసేవా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ సివిల్ సప్లయ్స్ శాఖను ఎంచుకోవాలి.
  • ఇక్కడ CORRECTIONS IN FOOD SECURITY CARD అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • కుడి వైపున డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది.

డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ ను పూర్తి చేయాలి.ఇందులో దరఖాస్తుదారుడి వివరాలను(ఎఫ్ఎస్ సీ నెంబర్) ముందుగా రాయాలి. నివాసం ఉండే ప్రాంతం వివరాలను ఎంట్రీ చేయాలి. ఎవరి వివరాలైతే మార్చాలనుకుంటున్నారో వారి వివరాలను నమోదు చేయాలి.

ఆధార్ ఫ్రూప్స్ తో పాటు నివాసం ఉండే ప్రాంతాన్నిధ్రువీకరించే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా మీసేవాలో ఆన్ లైన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల ప్రక్రియకు రూ. 45 చెల్లించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆపై మీ దరఖాస్తుకు అఫ్రూవ్ ఇస్తారు. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 040-48560012 నెంబర్ లేదా meesevasupport@telangana.gov.in మెయిల్ ను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.