తెలంగాణలో పంట పెట్టుబడి సాయం స్కీమ్ మళ్లీ పట్టాలెక్కబోతుంది. గతంలో మాదిరి రైతుబంధుగా కాకుండా.. రైతు భరోసా పేరుతో అమలు కాబోతుంది. ఈ స్కీమ్ కు సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏటా రూ. 12 వేల పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.
రైతు భరోసా స్కీమ్ ను జనవరి 26, 2025 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ అమలుపై ప్రాథమికంగా కొన్ని సందేహాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. మొన్నటి కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రైతు భరోసా స్కీమ్ పై కీలక నిర్ణయాలను వెల్లడించారు. సాగు యోగ్యత ఉన్న భూములకే పంట పెట్టుబడి సాయం అందిస్తామంటూ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై కొన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి.
పైప్రశ్నలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేబినెట్ నిర్ణయాలు మాత్రమే వెల్లడికాగా… రేపోమాపో గైడ్ లైన్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మార్గదర్శకాలు వస్తే… రైతు భరోసా అమలులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది…! మొత్తంగా రైతు భరోసా స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
సంబంధిత కథనం