ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగానూ భారీగా దరఖాస్తులు రావటంతో…. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి ఎంపిక చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా మొదటి విడత కింద 71 వేల మందికి ఇండ్లను మంజూరు చేసింది. వీరిలో పలువురు ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టారు. మరోవైపు రెండో విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించే క్రమంలో ప్రభుత్వం యాప్ సర్వే నిర్వహించింది. దరఖాస్తుదారుల అన్ని వివరాలను ఆన్ లైన్ చేసింది. వీటి ఆధారంగా దరఖాస్తులను 3 కేటగిరిలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా… ఇక సొంత స్థలం లేనివారని ఎల్-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు. ఈ కేటగిరీల విభజనలో తమ వివరాలను తప్పుగా నమోదయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాప్ సర్వేలో ఏమైనా తప్పులు ఉండటం లేదా…ఇంకేమైనా ఫిర్యాదులు ఉంటే ఆన్ లైన్ లో నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని గృహ నిర్మాణశాఖ కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను కూడా తీసుకువచ్చింది. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే…. మీ చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. చాలా సింపుల్ గా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అంతేకాదు… ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
ఇక మీరు చేసిన ఫిర్యాదుపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి “గ్రీవెన్స్ సెర్చ్ ” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ గ్రీవెన్స్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే మీ ఫిర్యాదు యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం