తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి-how to check details of market value of lands on telangana bhu bharati portal follow these steps ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి

తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి

తెలంగాణలో భూ భారతి పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా సులభంగా పలు వివరాలను తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా సర్వే నెంబర్ కు సంబంధించిన మార్కెట్ వాల్యూ వివరాలను పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.....

తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా భూ భారతి పోర్టల్ సేవలు ప్రారంభమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాల్లో ఈ పోర్టల్ ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త పోర్టల్ ఆధారంగానే... రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి. ధరణి స్థానంలో వచ్చిన భూ భారతి పోర్టల్ ద్వారా పౌరులు... పలు సేవలను సులభంగా పొందే వీలు ఉంది. లావాదేవీలు మాత్రమే కాకుండా...సమాచార సేవలు కూడా ఇందులో ఉన్నాయి.

సాధారణంగా భూములకు ప్రభుత్వం మార్కెట్ వాల్యూను నిర్ధారిస్తుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఇవి ఉంటాయి. ఒక ప్రాంతంలో ఒకలా ఉంటే... మరో ప్రాంతంలో మరో విధంగా ఉంటాయి. అయితే ఈ తరహా వివరాలను భూ భారతి పోర్టల్ ఆధారంగా సులభంగా తెలుసుకునే వీలు ఉంటుంది. భూమి ఉన్న ప్రాంతం వివరాలను నమోదు చేసి వివరాలను పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి...

మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా చెక్ చేసుకోండి:

  1. ముందుగా భూ భారతి అధికారిక పోర్టల్ bhubharati.telangana.gov.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే సమాచార సేవల్లోకి వెళ్లాలి. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది.
  3. ఈ ఆప్షన్ పై క్లిక్ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
  4. ఇక్కడ జిల్లా, మండలం, గ్రామ వివరాలను నమోదు చేయాలి. అంతేకాకుండా మీరు ఏ సర్వే నెంబర్ యొక్క మార్కెట్ వాల్యూను తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  5. అక్కడ సూచించే కోడ్ ను నమోదు చేస్తే ఇక్కడ మార్కెట్ వాల్యూ అసిస్టెంట్ సర్టిఫికెట్ అనే ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  6. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మార్కెట్ వాల్యూ వివరాలతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  7. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం