తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ అమలు కాబోతుంది. ఈనెల 26వ తేదీన ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించటమే కాకుండా… ఇటీవలనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్ వర్తింపజేయవద్దని స్పష్టం చేసింది. సాగులో లేని భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి పక్కనపెట్టాలని పేర్కొంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.
సాగు యోగ్యత లేని భూమికి పంట పెట్టుబడి సాయం అందిచమని సర్కార్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపింది. సాగు చేసే ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా దక్కనుంది. అయితే సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు… ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే సాగులోని భూముల వివరాలను ఎలా గుర్తిస్తారో ఇక్కడ చూడండి….
సంబంధిత కథనం