భూమి లేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ను జనవరి 26వ తేదీన ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో… అసలైన అర్హులను గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి వివరాలను సేకరించనున్నారు.
ఈ స్కీమ్ లో అర్హుల ఎంపిక కీలకంగా మారింది. ఓవైపు రైతు భరోసా స్కీమ్ ద్వారా పంట పెట్టుబడి సాయం అందించాలని సర్కార్ నిర్ణయించింది. రైతు భరోసాలో ఉండే లబ్ధిదారులకు ఈ స్కీమ్ వర్తింపజేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమిలేని కూలీలనే ఈ పథకానికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. గ్రామసభల ద్వారా ఫైనల్ చేసి అర్హుల జాబితాను రూపొందించాలని సూచించింది. అయితే ఈ స్కీమ్ ద్వారా ఎవరిని అర్హులుగా గుర్తిస్తారు..? ఎలాంటి అంశాలను ప్రతిపాదికగా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది…!
సంబంధిత కథనం