తెలంగాణలో రానున్న రెండు మూడు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర- దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో దాని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్ప పీడన ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుండటంతో దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలోని 24 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైంది. ఆదివారం ఆదిలాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మెదక్లో 23.8 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలు నమోదైంది.
ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆదివారం ఆదిలాబాద్లో 43.5 డిగ్రీలు, నిజామాబాద్లో 43.1డిగ్రీలు, భద్రాచలంలో 39.4 డిగ్రీలు, దుండిగల్లో 38.7 డిగ్రీలు, హకీంపేటలో 38.5 డిగ్రీలు, హన్మకొండలో 40డిగ్రీలు, ఖమ్మంలో 40.4డిగ్రీలు, మహబూబ్నగర్లో 40డిగ్రీలు, రామగుండంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత కథనం