ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ-hero mahesh babu responds to ed notices writes to set another date for hearing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ

ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ

సాయి సూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు మనీలాండరింగ్ కేసులో హీరో మహేశ్ బాబుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ నోటీసులపై మహేశ్ బాబు స్పందించారు. సోమవారం విచారణకు రాలేనని, మరో తేదీ నిర్ణయించాలని కోరారు.

ఈడీ నోటీసులపై స్పందించిన హీరో మహేశ్ బాబు, విచారణకు మరో తేదీ కేటాయించాలని లేఖ

హీరో మహేశ్ బాబు ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ ఉన్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను విజ్ఞప్తి చేశారు.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సంస్థలకు ప్రచారకర్తగా మహేశ్ బాబు

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు మహేశ్ బాబు ఇన్ ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ నోటీసులపై స్పందించిన మహేశ్ బాబు...విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.

ఈడీ నోటీసులు

టాలీవుడ్ అగ్ర హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇబ్బందుల్లో పడ్డారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న ఆయనకు ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నోటీసులు జారీ చేసింది.

సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‍‌లపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. దీంతో ఆ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న మహేశ్ బాబుకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు రావాలంటూ ఆదేశించింది.

రూ.5.9 కోట్లు

సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్న మహేశ్ బాబును ఏప్రిల్ 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రావాలని సూచించింది.

ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్నందుకు సాయి సూర్య డెవపర్స్ నుంచి మహేశ్ బాబు రూ.5.9 కోట్లు అందుకున్నారని ఈడీ పేర్కొంది. ఇందులో రూ.3.4 కోట్లను చెక్ రూపంలో, రూ.2.5 కోట్లను నగదుగా అందుకున్నారని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడంపై మహేశ్‍ను ఈడీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం