సరిహద్దుల్లో తెలుగు విద్యార్థులు.. 8 మందిని సురక్షితంగా కాపాడిన అధికారులు-help through control room for telangana citizens stranded at indian borders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సరిహద్దుల్లో తెలుగు విద్యార్థులు.. 8 మందిని సురక్షితంగా కాపాడిన అధికారులు

సరిహద్దుల్లో తెలుగు విద్యార్థులు.. 8 మందిని సురక్షితంగా కాపాడిన అధికారులు

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బార్డర్‌లోని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. విద్యా సంస్థలను మూసివేశారు. చాలామంది తెలుగు విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేరవేసే ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే 8 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భారత్-పాక్ సరిహద్దు (unsplash)

కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలని తరలించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తక్షణమే స్పందించారు. వర్సిటీ, కలెక్టర్‌తో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులను.. సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.

8 మంది సేఫ్..

ఇటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. దీని ద్వారా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 30 ఎమర్జెన్సీకాల్స్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 8 మందిని సురక్షితంగా కాపాడినట్టు తెలంగాణ భవన్ అధికారులు వివరించారు. విద్యార్థులు అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు.

త్యాగాలకు సిద్ధంగా ఉండాలి..

తాజా పరిస్థితులపై మాజీమంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశ ప్రజల భద్రతే మాకు ముఖ్యం. మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం కలిచివేసింది. ఇలాంటి సమయంలో యువత త్యాగానికి సిద్ధంగా ఉండాలి. సైనికుల కుటుంబాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది. సైనికుల పోరాటమే మాకు స్ఫూర్తి' అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

పాక్ కాల్పులు..

అటు ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులకు తెగబడుతోంది. పాక్ బలగాలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ఢిల్లీ ఎయిమ్స్‌ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్నవారిని అధికారులు వెనక్కిపిలుస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది.

మోగిన హెచ్చరిక సైరన్లు..

మరోవైపు దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. ఈ నెల 15 వరకు 24 ఎయిర్‌పోర్టులను బంద్‌ చేశారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని ఎయిర్‌పోర్టులను మూసివేశారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అమృత్‌సర్‌లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్‌లు మోగాయి. అమృత్‌సర్‌లో డ్రోన్‌ దాడికి పాక్‌ యత్నించింది. డ్రోన్‌ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత ఆర్మీ. అమృత్‌సర్‌లో పేలుళ్ల శబ్ధం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.

ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా..

అటు భారత భూభాగంలోకి పాక్‌ యుద్ధ విమానాలు ప్రవేశించినట్టు తెలుస్తోంది. భారత ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్న పాక్‌.. ఎల్‌వోసీ దాటి వచ్చి దాడి చేసేందుకు యత్నచింది. ఎయిర్‌ఫోర్స్‌ జెట్లతో భారత్‌పై దాడికి ప్రయత్నించింది. వాటిని భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అటు పంజాబ్‌లోని పలు ప్రాంతాలపై పాక్‌ దాడులు చేస్తోంది. లుథియానా ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయి.

అర్ధరాత్రి డ్రోన్లు..

జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో డ్రోన్‌ కదలికలను సైన్యం గుర్తించింది. అర్థరాత్రి ప్రాంతంలో రెండుసార్లు డ్రోన్ల కదలికలు జరిగినట్టు తెలిసింది. భారత వైమానిక దళం డ్రోన్‌ దాడులను తిప్పికొట్టింది. కంగ్నివాల్‌లో కారుపై రాకెట్‌ లాంటి వస్తువు పడింది. ఝండుసింఘా గ్రామంలో డ్రోన్లను పేల్చివేశారు. ఇంటిబయట నిద్రిస్తున్న వ్యక్తిపై డ్రోన్ శకలాలు పడ్డాయి.

సంబంధిత కథనం