తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం.. మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహించనున్నారు.
ఎండల తీవ్రత పెరుగుతున్నందున వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చినెలలో తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో మార్చి 15వ తేదీన కంటే ముందే ఒక్కపూట బడులు నిర్వహించాలనే చర్చ జరిగింది. తాజాగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు.
మార్చిలో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెలలోనే హోలీ, ఉగాది, రంజాన్ పండగలు ఉన్నాయి. ఈ మూడు రోజులు పోనూ.. రెండో శనివారం, ఆదివారాలతో కలిపి.. మొత్తం 8 రోజులు హాలిడేస్ రానున్నాయి. 2వ తేదీ ఆదివారం అయిపోయింది. ఇక 8వ తేదీ రెండో శనివారం వచ్చింది. ఈరోజు కూడా స్కూల్స్కు హాలిడే ఉంటుంది. 9వ తేదీ ఆదివారం. ఇక మార్చి 14వ తేదీ శుక్రవారం హోలీ పండగ ఉంది. 16వ తేదీ సండే. ఈ వారంలో మధ్యలో సెలవులు లేవు. మళ్లీ 23వ తేదీ ఆదివారం వచ్చింది. ఆ తర్వాత 30, 31వ తేదీల్లో సెలవులు వచ్చాయి.
ఇవాళ్టి నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రీ ఫైనల్ పరీక్షలన్నీ మార్చి 15వ తేదీతో ముగుస్తాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 21-03-2025 ఫస్ట్ లాంగ్వేజ్, 24-03-2025 థర్డ్ లాంగ్వేజ్, 26-03-2025 మ్యాథమేటిక్స్, 28-03-2025 ఫిజికల్ సైన్స్, 29-03-2025 బయోలాజికల్ సైన్స్, 02-04-2025 సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.