TG Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.లక్ష వరకు రుణమాఫీపై కీలక ప్రకటన-good news for telangana handloom workers government approves loan waiver up to 1 lakh rupees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.లక్ష వరకు రుణమాఫీపై కీలక ప్రకటన

TG Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.లక్ష వరకు రుణమాఫీపై కీలక ప్రకటన

TG Chenetha Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేయనున్నారు.

చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.లక్ష వరకు రుణమాఫీపై కీలక ప్రకటన

TG Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు ప్రభుత్వం రుణ మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

పద్మశాలి సంఘం మహాసభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో పునాది రాయి పడిందని అన్నారు. 17 వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశం మొత్తంమీద కులగణన జరగాలని, రిజర్వేషన్ల విషయంలో 50 శాతం గరిష్ట నిబంధనను సడలించాలన్న డిమాండ్ కు అనుగుణంగా మొట్టమొదటగా తెలంగాణలో పునాదిరాయి పడిందని అన్నారు.

“ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కులగణన చేపట్టాం. దానిపై కొందరు కావాలని తప్పుల తడక అని విమర్శిస్తున్నారే గానీ తప్పులెక్కడ ఉన్నాయో చెప్పడం లేదు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు వస్తే పరిపాలన బీసీల చేతుల్లోకి వెళుతుందని, వారి హక్కులను కాలరాయాలని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడుతా. రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా పిల్లల భవిష్యత్తు, వృత్తుల కోసం, వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవడం.. వంటి ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ హక్కులలో గట్టిగా సమిష్టిగా నిలబడండి.

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు

స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సాధించుకోవడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలన్న విజ్ఞప్తిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో పద్మశాలీల పాత్ర మరువలేనిది. ఈరోజు అనేక మందికి రాజకీయ నిలువనీడనిచ్చింది పద్మశాలీలే. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకు కూడా ఈ ప్రభుత్వం అంతే ప్రాధాన్యతనిస్తుంది"- సీఎం రేవంత్ రెడ్డి

"రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులకు ఏటా రెండు నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. అందుకు అవసరమైన 1 కోటి 30 లక్షల చీరలను తయారు చేసే బాధ్యత పద్మశాలీలకు అప్పగించాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు, కరెంటు బకాయిలు, బీమా డబ్బులను ఈ ప్రభుత్వం చెల్లించింది. సోలాపూర్‌లో మన పద్మశాలీ సోదరులే అక్కడ స్థిరపడ్డారు. అక్కడ మార్కండేయ భవన నిర్మాణం కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నాం. సోలాపూర్, బీవాండి, వర్లి వంటి అనేక ప్రాంతాల్లో మన సిరిసిల్ల సోదరులు స్థిరపడ్డారు” అని పేర్కొంటూ ముఖ్యమంత్రి బీసీలు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సమిష్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం