లంచం తీసుకుంటూ దొరికిన జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా-ghmc assistant engineer manisha caught red handed taking bribe ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  లంచం తీసుకుంటూ దొరికిన జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా

లంచం తీసుకుంటూ దొరికిన జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా

HT Telugu Desk HT Telugu

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మనీషా

హైదరాబాద్, జూన్ 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఒక బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించడానికి అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితులు ముందుగా రూ. 5,000 అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగతా రూ. 15,000 ఇచ్చే ముందు ఏసీబీని ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మనీషాను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.