వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురు దుర్మరణం-four passengers in travels bus killed in vikarabad road accident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురు దుర్మరణం

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. నలుగురు దుర్మరణం

Sarath Chandra.B HT Telugu

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 163 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి పెళ్లి బస్సు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు..

పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు ట్రావెల్స్‌ బస్సులో పరిగిలో జరిగిన పెళ్లి విందుకు హాజరయ్యారు.

స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని వీరి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు ముందు బాగం నుజ్జయింది. దీంతో బస్సులో ప్రయాణికులు చిక్కుకుపోయారు. మృతదేహాలను అతి కష్టం మీద స్థానికుల సాయంతో పోలీసులు వెలికి తీశారు.

మృతులను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ,బాలమ్మ ,(60)హేమలత (30) మల్లేష్ (26) సందీప్ (28) గా గుర్తించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం