బాసరలో విషాదం - గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!-five youths drown in godavari river in nirmal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బాసరలో విషాదం - గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!

బాసరలో విషాదం - గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!

నిర్మల్ జిల్లాలోని బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు.

బాసరలో విషాదం (representative image )

నిర్మల్‌ జిల్లాలోని బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కూడా హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.