మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట్ రోడ్డుపై ఓ తల్లి తన ఆరేళ్ల కుమారుడిని (ఒకటో తరగతి) స్కూటీపై స్కూల్ కు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఇంతలోనే బాలుడు ఎగిరి టిప్పర్ టైర్ కింద పడి నుజ్జునుజ్జు అయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లికి స్వల్ప గాయాలు కాగా…. విగతజీవిగా పడి ఉన్నకొడుకును చూసి తల్లడిల్లిపోయింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.