మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీకొని ముగ్గురు దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు..-fatal road accident in medak three killed six seriously injured after two cars collide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీకొని ముగ్గురు దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు..

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీకొని ముగ్గురు దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు..

Sarath Chandra.B HT Telugu

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట గేట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడాది వయసు ఉన్న చిన్నారి కూడా ఉన్నాడు.

వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొని ముగ్గురుమృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో చిన్నారులతో సహా 9మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మెదక్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఏడాది వయసు ఉన్న చిన్నారి ఎండీ గౌస్‌‌తో పాటు , అలీం(45) , అజీమ్‌ బేగం(40) దంపతులు మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.