SCR Special Trains: ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలివే-extension of summer special train services between kachiguda tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Extension Of Summer Special Train Services Between Kachiguda Tirupati

SCR Special Trains: ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 31, 2023 03:29 PM IST

South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతితో పాటు పలు ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లు పొడిగింపు
తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లు పొడిగింపు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు రూట్లలో కొత్త సర్వీసులను నడపనుంది. ఇందులో భాగంగా కాచిగూడ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ, కాచిగూడ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపుతోంది. అయితే వేసవి రద్దీ దృష్ట్యా వీటిని పొడిగించింది. ఈ మేరకు కొత్త తేదీలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

కాచిగూడ-తిరుపతి(ట్రైన్ నెం -07061) స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ జూన్ 1వ తేదీన కాచిగూడ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ( ట్రైన్ నెం- 07062 ) ట్రైన్ ను జూన్ 2వ తేదీన నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక కాచిగూడ-కాకినాడ టౌన్(ట్రైన్ - 07417 ) మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ప్రత్యేక రైలు జూన్ 3వ తేదీన రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక కాకినాడ టౌన్(ట్రైన్ నెంబర్ 07418) నుంచి కూడా జూన్ 04 ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ కాకినాడ నుంచి 09.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్... కాచిగూడ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ - 2 టైర్, ఏసీ - 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

IPL_Entry_Point