SLBC Update : కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో తవ్వకాలు.. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ టన్నె‌ల్‌లో ఏం జరుగుతోంది?-excavation underway at slbc tunnel site indicated by cadaver dogs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Slbc Update : కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో తవ్వకాలు.. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ టన్నె‌ల్‌లో ఏం జరుగుతోంది?

SLBC Update : కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో తవ్వకాలు.. ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ టన్నె‌ల్‌లో ఏం జరుగుతోంది?

SLBC Update : ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టారు. కానీ.. ఊట, నీరు కారణంగా వేగంగా కొనసాగడం లేదు. మూడు షిప్టుల్లో దాదాపు 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం.. 35వ రోజు అన్వేషణ కొనసాగుతుంది. బురదలో కూరుకుపోయిన లోకో ట్రైన్ పరిసరాల్లో మరో సారి అనుమానిత ప్రాంతాన్ని కాడవర్ డాగ్స్ సూచించాయి. కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో సహాయక బృందాలు తవ్వకాలు మొదలుపెట్టాయి. తవ్వకాలలో ఉధృతంగా వస్తున్న నీటి ఊటతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

సహాయకచర్యల్లో 600 మంది ..

వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు భారీ పంపులతో కృష్ణా నదిలోకి మల్లిస్తున్నారు. మూడు షిఫ్టులలో దాదాపు 600 మంది రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలి 8 మంది కార్మికులు గల్లంతైయ్యారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం దాదాపు నెల రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నెల రోజుల తర్వాత..

ప్రమాదం జరిగిన నెల రోజులకు.. అంటే మార్చి 9న టన్నెల్ ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇటీవల, సహాయక చర్యల్లో భాగంగా మరో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. ఈ సహాయక చర్యల్లో దాదాపు 25 బృందాలుగా 600 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు. సొరంగంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, నీటి ఊటను అడ్డుకోవడానికి రెస్క్యూ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

పర్యవేక్షణకు సీనియర్ అధికారి..

సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో పురోగతిని పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఎస్‌ఎల్‌బీసీ ఏంటి..

ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు అనేది నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించడానికి 43.93 కిలోమీటర్ల పొడవైన ఒక సొరంగం (టన్నెల్) నిర్మిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. అలాగే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం