Formula E Race Case : 'విచారణకు రండి' - కేటీఆర్ కు ఈడీ నోటీసులు..! ఏం జరగనుంది..?-ed issues notice to ktr in hyderabad formula racing case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Race Case : 'విచారణకు రండి' - కేటీఆర్ కు ఈడీ నోటీసులు..! ఏం జరగనుంది..?

Formula E Race Case : 'విచారణకు రండి' - కేటీఆర్ కు ఈడీ నోటీసులు..! ఏం జరగనుంది..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 28, 2024 09:09 AM IST

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 2,3 తేదీల్లో విచారించనుంది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ కూడా దూకుడు పెంచింది.

కేటీఆర్ కు నోటీసులు...?
కేటీఆర్ కు నోటీసులు...?

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఏసీబీతో పాటు మున్సిపల్ శాఖ నుంచి వివరాలను సేకరించి ఈడీ… విచారణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా… ఈ కేసులో ఉన్న కేటీఆర్ తో పాటు మిగతా ఇద్దరు అధికారులను విచారించనుంది. ఈ మేరకు కేటీఆర్ కు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.

yearly horoscope entry point

7వ తేదీన కేటీఆర్ విచారణ…!

వచ్చే జనవరి 7వ తేదీన కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(ఏ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారించనుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ చట్టం ఈడీ విచారణ చేస్తోంది.

కేటీఆర్ హాజరువుతారా..?

ఫార్ములా ఈరేస్ వ్యవహారంపై ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఏసీబీ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు చేశారని పేర్కొంది. ఫార్ములా-ఈ రేసు కేసు కొట్టివేయాలనే కేటీఆర్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని హైకోర్టును ఏసీబీ కోరింది. ఇక కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది.

ఇప్పటికే ఏసీబీ కేసుపై న్యాయపోరాటం చేస్తున్న కేటీఆర్… ఈడీ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ జారీ చేసిన నోటీసులకు స్పందించి.. విచారణకు హాజరవుతారా..? లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా..? అనేది ఉత్కంఠను రేపుతోంది.

దూకుడు పెంచిన ఏసీబీ…!

ఇక ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఏసీబీ కొన్ని కీలక అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు? నిధుల చెల్లింపు ఎలా చేశారనే దానిపై వివరాలను సేకరిస్తోంది. ఆదేశాలు ఎక్కడ్నుంచి వచ్చాయి? ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై లోతుగా పరిశీలిస్తోంది. అవసరమైతే ఉద్యోగుల వాంగ్ములాలను కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నవారికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా ఈ -కారు రేసు కేసులో ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దానకిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు.

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో వరసుగా కీలక పరిణామాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కేసు ఆధారంగా… విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీమంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇందులో భాగంగానే.. విచారణ కోసం నోటీసులను జారీ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం