దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఒకప్పటి పాత నాయకుడు కాదు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు!-dubbaka mla kotha prabhakar reddy changed his political line and became a hot topic in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఒకప్పటి పాత నాయకుడు కాదు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు!

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఒకప్పటి పాత నాయకుడు కాదు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు!

HT Telugu Desk HT Telugu

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇటీవ‌ల త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఊహించ‌ని విధంగా త‌న వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. కొన్నిరోజులుగా ప్ర‌భాకర్ రెడ్డి "కొత్త" పంథాలో గేర్లు మార్చ‌ుకుంటూ రాజ‌కీయాలు చేస్తున్న‌ారనే చర్చ జరుగుతోంది.

కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి

ఒకప్పుడు కేసీఆర్‌కు నమ్మినబంటు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి. బీఅర్ఎస్ పార్టీ నుండి 2014, 2019 లో మెద‌క్ పార్ల‌మెంట్ నుండి భారీ మెజారీటీతో విజ‌యం సాధించారు. రెండు ప‌ర్యాయాలు మెద‌క్ ఎంపీగా పనిచేసినా త‌ర్వాత.. 2023లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై జ‌రిగిన క‌త్తి దాడి.. తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ దాడి కార‌ణంగా ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న‌ా.. భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

15 వేల మెజార్టీ సాధించి..

2024లో జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా రఘునంద‌న్ రావు బ‌రిలో నిలిచారు. ఆయన దుబ్బాక స్థానికుడు. అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సుమారు 15 వేల మెజార్జీ వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ ప్రభాకర్ రెడ్డి త‌న ప‌ట్టును నిలుపుకున్నారు. సిద్దిపేట లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం 2 వేల మెజార్టీ మాత్ర‌మే వ‌చ్చింది. ప్రస్తుతం కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌సుత్తం సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్ష భాద్య‌త‌లను నిర్వ‌ర్తిస్తున్నారు.

స్టైల్ మార్చిన ప్రభాకర్ రెడ్డి..

కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పొలిటికల్ స్టైల్ మార్చారు. ప‌దేళ్లు మెద‌క్ ఎంపీగా ఉన్న‌ప్పుడు పొలిటిక‌ల్‌గా సైలెంట్ మోడ్‌లో ప్ర‌భాక‌ర్ రెడ్డి.. దుబ్బాక‌ ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత పూర్తిగా మారిపోయారనే టాక్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చినాకొత్త‌లో.. మెద‌క్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి చ‌ర్చ‌కు తెర‌లేపారు.

రేవంత్ రెడ్డిని కలిసి..

ఈ నెల 2వతేదిన దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది నిధుల కోసం.. మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఒంట‌రిగా క‌లిశారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. దుబ్బాకలో స్కిల్ యూనివ‌ర్సిటి ఏర్పాటు, హ‌బ్సీపూర్ నుండి దుబ్బాక వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ.. ఇలా వివిధ పనులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాక అభివృద్ది కోసం నిధులు మంజూరు చేయ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పి చర్చనీయాశంగా మారారు. సీఎం రేవంత్ రెడ్డికి పాజిటివ్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్ల‌ాడ‌టం పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.

కాంగ్రెస్ కూలిపోతుందని..

సీన్ కట్ చేస్తే.. ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోవాల‌ని ప్ర‌జ‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్త‌లు కొరుకుంటున్న‌ర‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దూమ‌రం రేపాయి. ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లపై మంత్రులు, పీసీసీ అధ్య‌క్షుడు తో స‌హ.. కాంగ్రెస్ నాయ‌కులు కౌంట‌ర్ ఇచ్చారు. ఏదో వ్యూహంలో భాగంగానే ప్రభాకర్ రెడ్డి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసి ఉంటారనే చ‌ర్చ జ‌రుగుతుంది.

సంబంధిత కథనం